Posted on 2025-02-21 21:47:27
ఇస్నాపూర్ లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి
శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నీలం మధు ముదిరాజ్.
డైలీ భారత్, పఠాన్ చేరు: దేవాలయాల నిర్మాణంతో గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నీలం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాధవానంద సరస్వతి హాజరై భక్తులకు ఆశీర్వాదం అందించారు.
ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి నుంచి బయట పడటానికి ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలన్నారు. దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఆలయాల నిర్మాణానికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్,ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి, మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు మన్నె రాఘవేందర్, ఊళ్ళ శంకర్, పెంటయ్య, యాదగిరి, రవి, రాజు, మణికంఠ, పాండు, వి నారాయణరెడ్డి, అశోక్, పాండు, సుధాకర్, ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >