Posted on 2026-05-06 14:57:33
డైలీ భారత్, ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరు నుండి జొన్నాడ వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డుపై మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శరవణ ఫైబర్స్ కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో మండపేట, కొత్తపేట ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. మంటలు చెలరేగిన సమయంలో రహదారి పైకి పొగలు భారీగా అలుము కోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఫైర్ సిబ్బంది, యజమాని మురళీకృష్ణ తెలిపారు. సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనాలు వేశారు.
అయితే ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఫైర్ సిబ్బంది సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >