Posted on 2024-02-27 13:24:39
డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజీవ్ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొడుతూ మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు కుకునూర్ పల్లి వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. రాజీవ్ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ.. అవతలవైపు ఎదురుగా వస్తున్న మరోకారును బలంగా ఢీకొట్టింది. అనంతరం గాల్లో ఎగిరి బలంగా రోడ్డుపై పడింది.
ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >