Posted on 2024-02-27 13:24:39
డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజీవ్ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొడుతూ మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు కుకునూర్ పల్లి వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. రాజీవ్ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ.. అవతలవైపు ఎదురుగా వస్తున్న మరోకారును బలంగా ఢీకొట్టింది. అనంతరం గాల్లో ఎగిరి బలంగా రోడ్డుపై పడింది.
ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు
Posted On 2026-01-16 20:39:04
Readmore >
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ
Posted On 2026-01-16 18:12:26
Readmore >
నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు
Posted On 2026-01-16 16:34:26
Readmore >
పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ
Posted On 2026-01-15 20:15:22
Readmore >