Posted on 2026-05-06 18:26:34
డైలీ భారత్, గుంతకల్: ఈనెల 13వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంతకల్లు, మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ మార్గాల మధ్య ప్రతిరోజు ప్యాసింజర్ రైలు నడిపేందుకు సిద్ధమయింది. 57407/ 57408 నంబర్ తో నడిచే ఈ రైలు గుంతకల్లు, మద్దికేర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబట్ల కృష్ణాపురం, కంభ, తర్లుపాడు రైల్వే స్టేషన్లలో ఆగుతూ మార్కాపురం రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ప్రతిరోజు గుంతకల్లులో సాయంత్రం 5:30 కి బయలుదేరి రాత్రి 11:30 కి మార్కాపురం చేరుకుంటుంది. మార్కాపురం రోడ్డులో ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 నిమిషాలకు బయలుదేరి ఉదయం 10: 30 నిమిషాలకు గుంతకల్లు చేరుతుంది.
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >