| Daily భారత్
Logo




పశ్చిమ బెంగాల్ : సువేందు అధికారి పీఏ దారుణ హత్య...

News

Posted on 2026-05-07 04:07:25

Share: Share


పశ్చిమ బెంగాల్ : సువేందు అధికారి పీఏ దారుణ హత్య...

డైలీ భారత్, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ బీజేపీ కీలక నేత సువేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతా సమీపంలోని మధ్యమ్‌గ్రామ్ నియోజకవర్గంలో బుధవారం రాత్రి ఈ దాడి జరిగింది. చంద్రనాథ్ రథ్ తన కారులో వెళ్తుండగా, దుండగులు వెంబడించి కాల్పులు జరిపారు. నిందితులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు చంద్రనాథ్‌కు తగిలాయి. తీవ్ర గాయాలైన ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దాడిలో ఆయనతో పాటు ఉన్న బుద్ధదేవ్ అనే మరో వ్యక్తి కూడా గాయపడటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >