| Daily భారత్
Logo




పశ్చిమ బెంగాల్ : సువేందు అధికారి పీఏ దారుణ హత్య...

News

Posted on 2026-05-07 07:37:25

Share: Share


పశ్చిమ బెంగాల్ : సువేందు అధికారి పీఏ దారుణ హత్య...

డైలీ భారత్, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ బీజేపీ కీలక నేత సువేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతా సమీపంలోని మధ్యమ్‌గ్రామ్ నియోజకవర్గంలో బుధవారం రాత్రి ఈ దాడి జరిగింది. చంద్రనాథ్ రథ్ తన కారులో వెళ్తుండగా, దుండగులు వెంబడించి కాల్పులు జరిపారు. నిందితులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు చంద్రనాథ్‌కు తగిలాయి. తీవ్ర గాయాలైన ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దాడిలో ఆయనతో పాటు ఉన్న బుద్ధదేవ్ అనే మరో వ్యక్తి కూడా గాయపడటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Image 1

పశ్చిమ బెంగాల్ : సువేందు అధికారి పీఏ దారుణ హత్య...

Posted On 2026-05-07 07:37:25

Readmore >
Image 1

అనుమతి లేని గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి...

Posted On 2026-05-06 23:24:18

Readmore >
Image 1

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే!!!

Posted On 2026-05-06 23:18:17

Readmore >
Image 1

వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్

Posted On 2026-05-06 23:16:52

Readmore >
Image 1

భద్రాచలం బ్రిడ్జి మలుపు- ప్రమాదాలకి తలుపు...

Posted On 2026-05-06 21:43:07

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-06 21:41:28

Readmore >
Image 1

వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్

Posted On 2026-05-06 19:43:56

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఎస్ఐ

Posted On 2026-05-06 18:54:08

Readmore >
Image 1

ఆలమూరులో కొబ్బరి పీచు ఫ్యాక్టరీ దగ్ధం...

Posted On 2026-05-06 18:27:33

Readmore >
Image 1

గుంతకల్లు, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు మధ్య కొత్తరైలు

Posted On 2026-05-06 18:26:34

Readmore >