Posted on 2026-05-07 11:10:33
డైలీ భారత్, సిద్దిపేట: వర్గల్ మండలం నాచారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హల్దీ వాగులో ఈతకు దిగిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఓ వివాహ వేడుక సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన పెళ్లి బృందం తూప్రాన్కు వెళ్లింది. అయితే వారిలో కొంతమంది యువకులు వివాహ వేడుక అనంతరం నాచారం గ్రామానికి వెళ్లారు. అక్కడ ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
సరదాగా ఈత కొట్టేందుకు పక్కనే ఉన్న హల్దీ వాగులోకి దిగారు. వాగు లోతును సరిగా అంచనా వేయకుండా లోపలికి వెళ్లారు. దీంతో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నేడు ముగ్గురి మృతదేహాలను గుర్తించి వాగు నుంచి బయటకు తీశారు. మృతులను ప్రశాంత్, వికాస్, కొంతమి ఆనంద్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. వివాహ వేడుకకు వచ్చి మృతిచెందడంతో నవ వధూవరులు సహా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర కన్నీటిపర్యంతమయ్యారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >