| Daily భారత్
Logo




ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

News

Posted on 2026-05-07 12:09:14

Share: Share


ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఓ దారుణ ఘటన ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆరేళ్ల ప్రేమ, మూడేళ్ల దాంపత్య జీవితం, రెండేళ్ల చిన్నారి ఉన్నా.. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త క్షణికావేశానికి లోనై భార్యను నడిరోడ్డుపైనే కత్తితో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

మృతురాలు 24 ఏళ్ల శిరీష కాగా, నిందితుడు ఆమె భర్త మణిదీప్. వీరిద్దరూ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని శిరీషను ప్రేమించిన మణిదీప్ పెళ్లి చేసుకుని కొంతకాలం సంతోషంగా జీవించాడు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం.

ఇటీవల మణిదీప్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో శిరీష తన పెద్దమ్మతో కలిసి కోదాడ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అక్కడ పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి, మరుసటి రోజు మళ్లీ రావాలని సూచించారు. సమస్య చర్చల ద్వారా పరిష్కారమవుతుందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ బయటకు వచ్చిన కొద్దిసేపటికే విషాదం చోటుచేసుకుంది.

పోలీస్ స్టేషన్‌ నుంచి బయల్దేరిన తర్వాత బస్టాండ్ సమీపంలోని టీ స్టాల్ వద్ద ఆటోలో శిరీష కూర్చొని ఉండగా, వెంట తెచ్చుకున్న కత్తితో మణిదీప్ ఆమెపై దాడి చేశాడు. ప్రజలు చూస్తుండగానే విచక్షణారహితంగా కడుపులో పొడవడంతో శిరీష తీవ్ర రక్తస్రావానికి గురైంది. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో బస్టాండ్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే ఇంత క్రూరంగా హత్య చేయడం చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఘటన అనంతరం మణిదీప్ నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి పెద్దమ్మ ఆవేదన వ్యక్తం చేస్తూ.. “నా బిడ్డకు న్యాయం జరగాలి. పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆమె కోరింది. సమస్య మాట్లాడుకుని పరిష్కారం అవుతుందని అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు” అంటూ కన్నీరుమున్నీరైంది.

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >