Posted on 2026-06-29 11:48:10
కూరెళ్ల గ్రామంలో రైతులతో కలిసి వ్యవసాయ పనులకు శ్రీకారం
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
మంత్రి పొన్నం ప్రభాకర్
డైలీ భారత్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి నాగలి దున్ని, విత్తనాలు చల్లి ఖరీఫ్ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రైతాంగానికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని భూమాతను ప్రార్థిస్తూ కూరెళ్ల గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. రైతులు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమాతకు, ప్రకృతికి నమస్కరించి మంచి పంటలు పండాలని ఆకాంక్షించే పవిత్రమైన రోజు ఇదన్నారు.
"అన్నం పరబ్రహ్మ స్వరూపం" అని మన పెద్దలు చెప్పారని, ఆ అన్నాన్ని పండించే రైతే దేశానికి వెన్నెముక అని మంత్రి అన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని మంత్రి వివరించారు.
రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి అన్ని పంటలు క్రిమి, కీటకాల బెడద లేకుండా సమృద్ధిగా పండాలని, రైతులకు ఆర్థికంగా మంచి రాబడి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రతి రైతు కుటుంబం భూమాత ఆశీర్వాదంతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >