Posted on 2026-06-29 20:35:41
డైలీ భారత్, కామారెడ్డి : జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్ ఐ .అండ్. పి .ఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళుతున్న కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జర్నలిస్టులను హౌస్ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెడ్డు సాయిలు మాట్లాడుతూ జర్నలిస్టుల యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్ ఐ .అండ్.పి.ఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరాక ముందే ఇండ్లలోకి పోలీసులు వచ్చి ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం అనేది హేయమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు. జర్నలిస్టుల యొక్క హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్ , హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని మా యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు పోరాడుతామని తెలిపారు. ఇలాంటి అరెస్టులకు ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ భయపడే ప్రసక్తి లేదని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు ఆశన్న, బాలాజీ, సంజీవులు పాల్గొన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >