Posted on 2026-05-06 23:16:52
డైలీ భారత్ రంగారెడ్డి డెస్క్:టీమ్ ఇండియా మాజీ పేసర్ అశోక్ దిండా క్రికెట్ మైదానం లోనే కాకుండా రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొయినా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, 16,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2021లోనూ ఇదే స్థానం నుంచి గెలిచిన దిండా, వరుసగా రెండోసారి తన పట్టు నిలుపుకున్నారు. ఐపీఎల్లో 69 వికెట్లు తీసిన మాజీ క్రికెటర్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తనదైన యార్కర్లతో దూసుకుపోతున్నారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >