Posted on 2025-02-21 17:08:13
డైలీ భారత్, హైదరాబాద్: JNTUH Vice-Chancellor (VC)గా టీ. కిషన్ కుమార్ రెడ్డి నియామకం విశ్వవిద్యాలయ చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచింది. గత 16 సంవత్సరాలుగా, ఇతర విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లను VCగా నియమిస్తున్న పరిస్థితిలో, ఈసారి JNTUHలోనే పనిచేసి, రిటైర్మెంట్ పొందిన మెకానికల్ విభాగం ప్రొఫెసర్ను VCగా ఎంపిక చేయడం విశేషం
ఈ సందర్భంలో JNTUH - JAC సభ్యులు VC ని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు, శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో సత్కరించి, గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం, విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థుల సమస్యలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు తదితర అంశాలపై VC తో చర్చించగా, ఆయన సానుకూలంగా స్పందించారు
JNTUHను భారతదేశంలో నంబర్ 1 విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను ఈ సమావేశంలో వ్యక్తం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో JNTUH - JAC చైర్మన్ మంద రంజిత్ కుమార్, ప్రెసిడెంట్ కోతురు పవన్, వైస్ ప్రెసిడెంట్ మూడ్ నరేష్, బొజ్జ ప్రణయ్ భాస్కర్, సభ్యులు సందీప్, సాగర్,వంశీ, రవి, వినయ్, నితీష్, శ్రీకర్ తదితరులు పాల్గొని విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ మద్దతును ప్రకటించారు
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >