Posted on 2025-02-21 21:34:44
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్రమ ఇసుక తోలకాలు జరుపుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన జూలూరుపాడు మండల పరిధిలో గల బేతాలపాడు గ్రామంలో జరిగినది వివరాల్లోకి వెళితే చింతల తండ గ్రామానికి చెందిన భూక్య రాందాస్ తండ్రి పేరు బిచ్చా అను అతను ఓ జెసిబి ని లీజుకు తీసుకొని బేతాళ పాడు పంచాయతీకి చెందిన ట్రాక్టర్ యజమానులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తానని ఆశ చూపి ఐదు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పంతులు తండా గ్రామ శివారులో గల పెద్ద వాగులో నుండి జెసిబి ద్వారా ట్రాక్టర్లలో నింపుతుండగా ఉదయం 5 గంటల సమయంలో ఒక జెసిబి ఐదు ట్రాక్టర్లను స్వాధీన పరుచుకుని జెసిబి బ్రోకర్ భూక్యరాందాస్, జెసిబి డ్రైవర్ పగడాల వేణు, ట్రాక్టర్ డ్రైవర్లైన దారావత్ రాందాస్ నునావత్ బీమా, గుగులోతు సంపత్, గుగులోతు సక్రు, ట్రాక్టర్ యజమానులైన బానోతు లక్ష్మణ్, బానోతు కసన, భానోత్ అనితలపై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాదావత్ రవి కేసు నమోదు చేసినారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >