Posted on 2025-02-21 18:21:11
కందుకూరి రాణి అనే గిరిజనేతర మహిళ అక్రమంగా పొందిన ST కుల ధ్రువీకరణ పత్రంను రద్దు చేస్తూ కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు
అక్రమంగా ఎస్టీ సర్టిఫికెట్ పొందిన వారిపై మరియు ఇచ్చిన అధికారుల పై చర్యలు తీసుకోవాలనీ ఆదిమ ఆదివాసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్
డైలీ భారత్ భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదిమ ఆదివాసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో mro మరియు si గారికి అక్రమంగా ఎస్టీ కుల ధ్రువీకరణ పట్టా పొందిన మరియు ఇచ్చిన అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మెమొరండం ఇవ్వడం జరిగినది,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన కందుకూరి రాణి అనే ఒక గిరిజనేతర మహిళ ST కోయ కుల ధ్రువీకరణ పత్రం 8/10/2020 న దమ్మపేట మండల తాసిల్దార్ కార్యాలయం దగ్గర నుండి పొంది అమాయక ఆదివాసీల భూములను సుమారు 15 ఎకరాలు భూమిని అక్రమంగా ఆక్రమించుకొని, ఆదివాసీలపై అక్రమ కేసులు పెడుతూ, బౌతిక దాడులకు పాల్పడుతూ,భయభ్రాంతులకు గురిచేస్తున్నధి,
అట్టి విషయాన్ని తెలుసుకున్న ఆదిమా ఆదివాసీల సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ సంఘం వారు ఆ మహిళ గురించి పూర్తి ఆధారాలతో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి సమర్పించగా కలెక్టర్ ఆ నకిలీ ST కుల ధ్రువీకరణ పత్రం పొందిన మహిళ పై పూర్తి విచారణ చేశారు,ఈ రోజు ఆ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు పరిచినట్లు ఆదేశాలు ఇవ్వడం జరిగినదనీ తెలిపారు, నకిలీ కులదవీకరణ పత్రం పొందిన మరియు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాల నాయకులు తెలిపారు,ఈ కార్యక్రమంలో కన్నెబోయిన వెంకట నరసయ్య,కారం బుజ్జి,చవళం కృష్ణయ్య,రావుల అప్పారావు,శోభన్ బాబు,లక్ష్మీ, వాసం పోలయ్య,తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >