Posted on 2024-09-01 12:18:10
డైలీ భారత్, వరంగల్ జిల్లా: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జనాలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వరదల్లో చిక్కుకుంది. వరంగల్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న TS24Z 0018 నెంబరు గల ఆర్టీసీ బస్సు నెక్కొండ – వెంకటాపురం చెరువు కట్ట పైన నిన్న రాత్రి 9గంటల ప్రాంతంలో వరద ప్రభావంతో చిక్కుకుపోయింది. వెంకటాపురం వద్ద తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో వీరు చిక్కుకుపోయారు. ఈ బస్సులో దాదాపుగా 45 మంది ప్రయాణికులున్నారు. రాత్రి నుండి ముందుకు వెనకకు పోలేక ప్రాణాపాయ పరిస్థితిలో సహాయం కోసం ఎదురు చూశారు ప్రయాణికులు. తమకు తాగడానికి మంచినీళ్లు కూడా లేవని బస్సులో చిన్న పిల్లలు ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను రక్షించాలంటూ వేడుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గ్రామానికి చేరుకుని… ట్రాక్టర్ సహాయంతో ప్రయాణికులను రక్షించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. వర్షం తగ్గిన తర్వాత వారి గమ్యస్థానాలకు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇక మరో ఘటనలో విజయవాడ నుంచి మధిర వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మీనవోలు వద్ద వరదలో చిక్కుకుంది. స్థానికులు తాడు సాయంతో బస్సులో ఉన్న ప్రయాణికులను అవతల ఒడ్డుకు చేర్చారు.
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >