Posted on 2024-09-01 12:17:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి.శుక్రవారం రాత్రి మొదలైన వాన యమజోరుగా కురుస్తుంది. మరో రెండు రోజులు పాటు వర్షాలు ఇలాగే పడుతాయంటూ వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ ఎలర్ట్ కూడా జారీ చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో అత్యధికంగా 299.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోదాడలో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో రెండు కార్లు, ఆటోలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. అయితే కొట్టుకుపోయిన ఓ కారులో డెడ్ బాడీ ఉన్నట్లుగా స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే కారులో ఉండగానే వ్యక్తి చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇక నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో తల్లీకూతురు హనుమమ్మ(78), ఆమె రెండో కూతురు అంజిలమ్మ(38) మృతిచెందారు. భర్త చనిపోవడంతో అంజిలమ్మ తన తల్లి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలకు శనివారం రాత్రి ఇల్లు కూలిపోవడంతో తల్లీకూతురు మృతి చెందారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు.
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >