Posted on 2026-03-07 18:12:44
చిన్న మల్లారెడ్డిలో హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం – దళిత కుటుంబాలకు “ఇందిరమ్మ ఇల్లు” గృహప్రవేశం
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ దళిత కుటుంబాలకు “ఇందిరమ్మ ఇల్లు” నిర్మించి గృహప్రవేశం నిర్వహించడం జరిగింది.
గతంలో 18-03-2023న, అప్పటి టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో భాగంగా కామారెడ్డి నుండి రాజంపేట్ వరకు నిర్వహించిన పాదయాత్ర సమయంలో చిన్న మల్లారెడ్డి గ్రామంలోని హరిజనవాడలో నివసిస్తున్న దళిత కుటుంబాలకు చెందిన బిక్నూర్ లక్ష్మి మరియు రాజమణి గారి ఇళ్లను పరిశీలించారు. ఆ సమయంలో వారి ఇళ్లు శిధిలావస్థలో ఉండటాన్ని గమనించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీని నిలబెట్టుకుంటూ, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పథకం ద్వారా వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి, నిత్యావసర సామగ్రిని కూడా అందజేసి గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మరియు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందనే విషయానికి ఇది నిదర్శనమని తెలిపారు. దళిత కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >
వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-03-07 18:10:19
Readmore >
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >