| Daily భారత్
Logo




పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

News

Posted on 2026-08-05 17:07:25

Share: Share


పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

డైలీ భారత్, కామారెడ్డి : పెద్ద కొడాపుగల్ గ్రామానికి చెందిన పండరి – స్వరూప దంపతులు వరుస విషాదాలతో తీవ్ర కష్టాల్లో జీవనం సాగిస్తున్నారు. కుమారుడిని కోల్పోయిన ఈ కుటుంబానికి మరో దెబ్బగా స్వరూప గారు గత 10 సంవత్సరాలుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

వైద్య ఖర్చుల కోసం కుటుంబం తమ 25 గుంటల భూమిని విక్రయించుకున్నట్లు తెలిసింది.

ఈ విషయం తెలుసుకున్న శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ దత్త ఆధ్వర్యంలో ట్రస్ట్ తరఫున “నెలకొక మంచి పని – నెలకొక సేవ” కార్యక్రమంలో భాగంగా 11వ నారాయణ సేవ నిర్వహించారు.

కామారెడ్డి బృందావన కాలనీలో నివసిస్తున్న ఈ నిరుపేద కుటుంబానికి శ్రీ మాత  కుటుంబ సభ్యుడు మచ్చ నాగరాజు గుప్తా ద్వారా 25 కిలోల బియ్యం, కిరాణా సామానులు, కూరగాయలు అందజేశారు.

ట్రస్ట్ సభ్యులు భవిష్యత్తులో కూడా కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

పట్నం శెట్టి శ్రీనివాస్, మచ్చ నాగరాజు గుప్తా, సాయిరాం, సంఘ రాజు, భాస్కర్, శ్రీకాంత్

మానవ సేవే మాధవ సేవ — శ్రీమాతా సేవ కుటుంబం

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >