Posted on 2025-11-12 14:40:42
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ నవదుర్గ మాత ఆలయం 5వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్ అలుక కిషన్ ఆధ్వర్యంలో, కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ, ఖజానాదారు సత్యనారాయణ, సభ్యులు ఉమా కిరణ్, సత్యం, గంధం వెంకటేశ్వర్లు, పెద్దోళ్ల నాగరాజు తదితర కమిటీ సభ్యుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, హాజరై, భక్తులకు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించిన వారు, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆలయంలో నిర్వహించిన మహా పూజలు, హోమాలు, అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున హాజరై దేవీదర్శనం చేసుకున్నారు. భక్తి నమ్మకాలు, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యత ప్రతిఫలించిన ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది.
ఈ సందర్భంగా చైర్మన్ అలుక కిషన్ మాట్లాడుతూ “భక్తుల సహకారంతో ఆలయం ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని” తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని భక్తులు, అధికారులు, కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >