Posted on 2026-05-05 16:56:42
డైలీ భారత్, ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. పద్మజ మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఆమె భర్తే హత్య చేసినట్లు గుర్తించారు. పద్మజ భర్త కిరణ్ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను ప్రొద్దుటూరు పోలీసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. లావుగా ఉండటంతో పాటుగా, నిత్యం అనుమానిస్తోందనే కోపంతో పాలకోవాలో విషం కలిపి.. ఆపై దిండుతో అదిమి కిరణ్ కుమార్ తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ హత్య కేసు మిస్టరీ వీడింది. భర్త కిరణ్ కుమార్.. పద్మజను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ కుమార్, ముద్దనూరుకు చెందిన పద్మజకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు ఏడేళ్ల పాప కూడా ఉంది. అయితే కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. భార్య భర్తల మధ్యన మనస్పర్థలు తలెత్తాయి. దీనికి తోడు తన భార్య లావుగా ఉందని.. ఎక్కువగా తింటోందని కిరణ్ కుమార్ భావిస్తూ వచ్చాడు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు
భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్న కిరణ్.. అందుకు పక్కా స్కెచ్ వేసుకున్నాడు. ముందుగా విషం పెట్టి భార్యను హత్య చేయటం ఎలా అనే దానిపై యూట్యూబ్లో శోధించాడు. ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి హైదరాబాద్ నుంచి విషం తెప్పించుకున్నాడు. ఈ విషాన్ని పాలకోవాలో కలిపిన కిరణ్ కుమార్.. భార్య పద్మజకు తినిపించాడు. భార్య అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత.. ఇంకా చనిపోలేదని, దిండుతో అదిమి హత్య చేసినట్లు ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ కేసులో నిందితుడైన కిరణ్కు వివాహేతర సంబంధం కూడా ఉందని ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు. ఏడాది కిందట హైదరాబాద్లో ఉన్న సమయంలో వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందని.. అయితే పద్మజ హత్యకు, ఆ మహిళకు సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకూ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.
చంపాలని నిర్ణయించుకుని.. ప్రేమగా ఇంటికి తెచ్చి, పాలకోవాలో విషం పెట్టి..
భార్యభర్తల మధ్య విభేదాలు రావటంతో గత కొంతకాలంగా పద్మజ తల్లివద్ద ఉంటోంది. అయితే భార్యను చంపాలని నిర్ణయించుకున్న కిరణ్.. ఆమెను పుట్టింటి నుంచి తన ఇంటికి తెచ్చాడు. ప్రేమగా నచ్చజెప్పి ఆమెను ఒప్పించి ఇంటికి తెచ్చిన కిరణ్.. మూడు రోజులు ఆమెతో బాగానే ఉన్నాడు. ఏప్రిల్ 29వ తేదీ హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా తెచ్చిన విషాన్ని పాలకోవాలో కలిపి.. ఆమెకు తినిపించి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పద్మ తల్లిదండ్రులకు ఆమె చనిపోయిందని సమాచారం అందించాడు
అయితే కిరణ్ మీద అనుమానంతో పద్మజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి పద్మజ పోస్టుమార్టం నివేదికలో కొన్ని అనుమానాలు వ్యక్తం కావటంతో.. పోలీసులు కిరణ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో కిరణ్ నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >