| Daily భారత్
Logo




గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

News

Posted on 2026-05-05 15:03:11

Share: Share


గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

డైలీ భారత్, వరంగల్: గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలకో చట్టాలను అతిక్రమించ వద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. మూగ జీవాల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గో రక్షణ కమిటీలతో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో  ముందుగా మూగ జీవాల అక్రమ రవాణాకు నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై గో రక్షణ సమితి సభ్యులను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతం వాహన తనీఖీలు నిర్వహించబడుతాయని, ఇందుకోసమని ప్రత్యేకంగా పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని అదే విధంగా గోవుల అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా సమాచారం తెలిసిన వెంటేనే పోలీసులకు సమాచారం అందించాలి కాని గోవులను రక్షించాలనే క్రమంలో  గో రక్షణ కమిటీ సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ముఖ్యంగా ఇదే సమయంలో అక్రమంగా గోవులను  తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు  రక్షణ కమిటీ సభ్యులు వాహనాలపై  రవాణా చేస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వేగంగా వాహనాలను నడపటం చాలా ప్రమాదకరమని, అలాగే అక్రమంగా మూగ జీవాలను తరలిస్తున్న వాహనాలను అడ్డుకునే సమయంలో  నిందితులు దాడులకు పాల్పడే అవకాశాలతో పాటు శాంతి భద్రతలు సమస్యలు రావచ్చని,  మీరు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు  వున్నాయని, ఇకపై స్థానికంగా వున్న గో రక్షణ కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లను స్థానిక పోలీసులతో షేర్ చేసుకోవడం ద్వారా నకలీ ఫోన్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చని, దీని ద్వారా త్వరితగతిన గోవులను రక్షించే అవకాశం కలుగుతుందని మూగ జీవాలను అక్రమంగా తరలించే వారిని పట్టుకోవడం పోలీసుల బాధ్యతని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తెసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్‌కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, ట్రైనీ ఐపిఎస్ మనిషా నేహ్రా,ఏసిపిలు జితేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, భీంశర్మ, సతీస్‌బాబు, రవీందర్ రెడ్డితో పాటు ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు, గో రక్షణ, బంజరంగ్, విశ్వహిందు పరిషత్‌కు చెందిన ప్రతినిధులు పాల్గోన్నారు.

Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >
Image 1

రాఖీ పండుగ

Posted On 2026-08-28 02:56:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Posted On 2026-08-27 19:02:09

Readmore >
Image 1

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి

Posted On 2026-08-27 19:00:55

Readmore >
Image 1

అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-27 17:17:45

Readmore >
Image 1

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి

Posted On 2026-08-27 17:15:17

Readmore >
Image 1

సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా

Posted On 2026-08-27 16:57:22

Readmore >
Image 1

హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన

Posted On 2026-08-27 16:49:27

Readmore >