| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి

జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పిలుపు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా నియామకమైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నుండి  అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు బుధవారం కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మంత్రి పదవిలో ఉన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లాను అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకువెళ్లారని, జిల్లాకు మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కి ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప మనసున్న నేతకు రాష్ట్రప్రభుత్వం తమ మంత్రివర్గ క్యాబినెట్లో ముఖ్య సలహాదారులుగా నియామకం అయినందున ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడికి మంత్రి  హోదా ఇవ్వడం సంతోషకర విషయం అని అన్నారు.

ముఖ్య సలహాదారులుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియమితులైన తర్వాత సుదర్శన్ రెడ్డిజిల్లాకు మొట్టమొదటిసారిగా రాబోతున్న సందర్భంగా ఆయనకు జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలకడం జరుగుతుందన్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు మాధవ్ నగర్ సాయి బాబా ఆలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. 

అక్కడి నుండి పాత కలెక్టర్ గ్రౌండ్ చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శ్రీనివాస్, యాదగిరి,  తదితరులు పాల్గొన్నారు.

Previous పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం
Next టీఎన్జీవో ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
ADVERTISEMENT