Posted on 2026-03-11 20:19:53
బాధితురాలికి అండగా నిలిచిన దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నరసింహసాగర్ కు చెందిన దంసలపూడి పద్మ అనే మహిళను తన కొడుకు నాగరాజు ఆస్తి కోసం కొడుతూ తిడుతూ ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బందులు తట్టుకోలేక ఆ మహిళ దిశ ప్రొటెక్షన్ టౌన్ అధ్యక్షురాలు అరుణ ను ఆశ్రయించింది. దిశ ప్రొటెక్షన్ ఫౌండేషన్ చైర్మన్ బీవీ రాజు, ఉపాధ్యక్షులు కళ్యాణి, జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మీ, జిల్లా జనరల్ సెక్రెటరీ పిట్టల కమలమ్మ సూచనతో టౌన్ అధ్యక్షురాలు బొల్లం అరుణ ఆధ్వర్యంలో బాధిత మహిళ దంసలపూడి పద్మతో మాట్లాడిన సభ్యులు ఆమె సమస్యను తెలుసుకుని సుజాతనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై రమాదేవి ని కలిసి పద్మ న్యాయం జరిగేలా చూడాలని మాట్లాడి బాధితురాలు కొడుకుపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ మండల ప్రెసిడెంట్ దేవరపల్లి రజిని, జగన్నాధపురం మండల ప్రెసిడెంట్ గడ్డం జ్యోతి, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మందకృష్ణ వేణి, దిశా సభ్యురాలు బిందు పాల్గొన్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >