Posted on 2026-06-27 18:49:05
డైలీ భారత్, ఖమ్మం: మత్తు పదార్దాల నిర్మూలనలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన సుమారు 3 కోట్ల 43 లక్షల విలువ చేసే 687.409 కిలోల ఎండు గంజాయిని కోర్టు ఆదేశాల మేరకు శాస్త్రీయ పద్ధతిలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, సిసిఆర్బీ ఏసీపీ సాంబరాజు శనివారం తల్లాడ మండలం గోపాల్పేటలోని ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్లో దహనం చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 29 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిబంధనలు అనుగుణంగా ఈ దహనం జరిగిందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్బంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి సాగు చేసినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సి ఐ సర్వయ్య, ఇన్స్పెక్టర్ మోహన్ బాబు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >