Posted on 2026-06-27 07:16:30
రాజోలు పోలీసుల సత్వర స్పందనకు ఎస్పీ ప్రశంసలు...
డైలీ భారత్,అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీసుల అప్రమత్తతతో అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికలను కేవలం గంట వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు వేగంగా స్పందించి బాలికలను క్షేమంగా గుర్తించిన రాజోలు పోలీసులను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ మీనా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
రాజోలు పరిధిలోని నున్నవారి బడువ, అడవివారిపాలెం ప్రాంతాలకు చెందిన 14, 15, 16 ఏళ్ల ముగ్గురు బాలికలు స్నేహితులు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని వ్యక్తి ఇంటికి వెళ్లిన విషయమై ఒక బాలికను ఆమె తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ముగ్గురూ శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.
రాత్రి వరకు వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాత్రి 9.30 గంటల సమయంలో రాజోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే రాజోలు ఎస్ఐ పి. మల్లికార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి రాజోలు సెంటర్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా బాలికలు నున్నవారి బడువ వైపు వెళ్లినట్లు గుర్తించి, స్థానికుల సహకారంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు.
పోలీసుల వేగవంతమైన చర్యల ఫలితంగా రాత్రి 10.30 గంటలకల్లా, ఫిర్యాదు అందిన గంటలోనే ముగ్గురు బాలికలను సురక్షితంగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మైనర్ బాలికల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి, అత్యంత వేగంగా స్పందించిన రాజోలు ఎస్ఐ పి. మల్లికార్జున రెడ్డి, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ మీనా ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సత్వర స్పందన, కర్తవ్యనిర్వహణ ప్రజల్లో పోలీసులపై మరింత విశ్వాసాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.
తమ పిల్లలను క్షేమంగా గుర్తించి అప్పగించిన రాజోలు పోలీసులకు, అలాగే ప్రత్యేక శ్రద్ధ చూపిన జిల్లా ఎస్పీకి బాలికల తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >