Posted on 2026-06-26 19:33:09
లేకుంటే పిఆర్ కమిషనరేట్ ముట్టడి
ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న
డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు దళిత జర్నలిస్టులంతా ఏకం కావాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలోని దళిత, గిరిజన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న సామాజిక వివక్షతను ఖండిస్తూ, అక్రిడేషన్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అర్హులైన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు అక్రిటేషన్ కార్డులు ఇవ్వాలని అన్నారు. 2024 వరకు ఇచ్చినటువంటి కార్డులు కాలం గడిచిపోయి సంవత్సరం పై అయినప్పటికీ ఇంకా కార్డుల విషయంలో జాప్యం చేయడం సరికాదని అన్నారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలో కళాశాలలో 50 శాతం రాయితీ కాకుండా 100% రాయితీ కల్పించాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. ఈనెల 28వ తేదీ లోపు ప్రభుత్వం స్పందించి ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఈనెల 29వ తేది సోమవారం రోజున తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్, ఏసీ గార్డ్స్ ప్రాంతంలో గల ఐ & పి ఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్ల విషయంలో దళిత, గిరిజన జర్నలిస్ట్ లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అక్రిడిటేషన్ కమిటీలలో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగిస్తూ దళిత, గిరిజనపై వివక్షతను నేటికీ కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ విధానాన్ని తక్షణమే విరమించాలని, అర్హులైన ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించి వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు దళిత, గిరిజన జర్నలిస్ట్ లకు అన్యాయం జరుగుతోందని దళిత, గిరిజన జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ కమిటీలలో స్థానం కలిగించినప్పుడే దళిత, గిరిజన జర్నలిస్ట్ లకు న్యాయం జరుగుతోందన్నారు. అలాగే దళిత, గిరిజన జర్నలిస్ట్ లకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ ముట్టడి కార్యక్రమానికి దళిత, గిరిజన జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, సామాజిక న్యాయవాదులు తమ మద్దతును ప్రకటించి, పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తెడ్డు సాయిలు, జిల్లా అధ్యక్షులు కుంటొల్ల యాదయ్య, జాయింట్ సెక్రెటరీ పెరుమాళ్ళ రాజు, కిసరి రాజు, జిల్లా సలహాదారులు బి.సాయిలు, రవి నాయక్, రాజలింగం, రవి, ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్హెచ్ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >