Posted on 2026-06-25 21:51:45
అధికార దుర్వినియోగంతో ఆస్తుల కూడిక: కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ ఇల్లే లక్ష్యంగా తనిఖీలు..
భారీగా నగదు, ప్లాట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు..
డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండెటి రాము (42) పై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కింద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో వేములవాడ ఎక్సైజ్ స్టేషన్ ఎస్ హెచ్ఓగా విధులు నిర్వహించిన ఆయన, తన సర్వీస్ కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ మార్గాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారనే నమ్మదగిన సమాచారంతో ఈ నెల 24న ఏసీబీ అధికారులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఏడాది మార్చి 17న నమోదైన క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు (Cr. No. 05/RCO-ACB-KNR/2026) ఆధారంగా జగిత్యాలలోని భవానీ నగర్లో ఉన్న ఆయన అద్దె ఇంట్లో (ఇంటి నంబర్: 4-2/7/9) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిందితుడి ఎస్బీఐ ఖాతాలో రూ. 29,88,317/- నగదు, ఆయన తండ్రి యూబీఐ ఖాతాలో రూ. 16,77,978/- బ్యాంక్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు ఇంట్లో రూ. 20,67,850/- చేతి నగదు, రూ. 11,97,000/- విలువైన ఇతర సామాగ్రి లభించాయి. అలాగే కరీంనగర్ పట్టణంలో రూ. 6,05,000/- విలువైన ఒక ఓపెన్ ప్లాట్, సిరిసిల్లలో రూ. 2,18,484/- విలువైన కమర్షియల్ ల్యాండ్కు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దస్తావేజుల ప్రకారం వీటి మొత్తం విలువ రూ. 87,44,629/- గా తేలినప్పటికీ, బహిరంగ మార్కెట్లో వీటి విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని సోదాలు, లోతైన దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు లేదా వాట్సాప్ (9440446106) ద్వారా సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయని అధికారులు స్పష్టం చేశారు.
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్హెచ్ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >