Posted on 2026-06-26 20:09:15
డైలీ భారత్ స్పెషల్:
లంచం సామ్రాజ్యం....
చేతిలో లంచం జారిన క్షణం...
చరిత్ర తలవంచి ఏడుస్తుందని మరచి పోయామా..!
ధర్మం ధరించిన వస్త్రం చినిగితే....
దేశం దిక్కులేని నావవుతుందని మరచి పోయామా..!
లంచం మబ్బులు తొలిగితేనే...
దినకరుడి దివ్య కిరణాలు భూమిని తాకుతాయి అని గుర్తుంచుకో..!
లంచం తీసుకున్న చేయి
ఒక్క మనిషిని కాదు...
తరతరాల భవిష్యత్తును గాయపరుస్తుంది అని గుర్తుంచుకో..!
ఒక పేద తండ్రి...
కూతురి ప్రాణం కాపాడాలని
ఆసుపత్రి గుమ్మం ముందు చేతులు జోడించాడు...
లోపల మాత్రం ముందు లంచం... తర్వాత చికిత్స అన్న చల్లని మాటలు వినిపించాయి...
ఆ రోజు... చనిపోయింది ఒక చిన్నారి కాదు...
మనిషిలో మిగిలిన మానవత్వం..!
సత్యమనే సుగంధంతో...
అవినీతిని అణచివేసి
మనిషిలో నింపుతాం సేవాతత్వం..!
మనసులో మలినం మొలకెత్తిన చోట
మట్టిలో కాదు మనుగడలోనే చీడ పుడుతుందని
మంజుల పత్తిపాటి కలం చెబుతుంది..!
సత్యమే శ్వాసగా...
నిజాయితీయే నడకగా...
న్యాయమే నిత్యసఖిగా నిలిస్తే...
భారతభూమి భవ్యభవితకు
బంగారు బాటలు పరచుకుంటుందని
మంజుల పత్తిపాటి కలం చెబుతుంది..!
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్హెచ్ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >