| Daily భారత్
Logo




హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

News

Posted on 2026-06-26 20:15:06

Share: Share


హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

దర్జాగా ఫెన్సింగ్ వేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

అధికారులు, పంచాయతీ పాలకవర్గంపై గ్రామస్థుల ఆగ్రహం

డైలీ భారత్, హాజిపల్లి: ఫరూఖ్ నగర్ మండలం లోని హాజిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. గ్రామ కంఠానికి చెందిన స్థలాన్ని శంషాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దర్జాగా కబ్జా చేస్తున్నా అడిగేవారే కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు.

ప్రైవేట్ భూమి ముసుగులో కబ్జా

సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గ్రామ కంఠం స్థలానికి ఆనుకుని కొంత పట్టా భూమి ఉంది. దానికి ఫెన్సింగ్ వేసే నెపంతో, పక్కనే ఉన్న  గ్రామ కంఠం భూమిని అందినకాడికి తన స్థలంలో కలిపేసుకుంటూ ఫెన్సింగ్ వేస్తున్నాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే "నీకేం సంబంధం?" అంటూ ఎదురుదాడికి దిగుతుండటంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలకవర్గంపై అనుమానాలు.. స్థానికుల ఆగ్రహం

ఒక స్థానికేతరుడు వచ్చి గ్రామ ప్రజల ఉమ్మడి ఆస్తిని కాజేస్తుంటే.. గ్రామ పాలక వర్గం ఎందుకు మౌనంగా ఉంటున్నారని గ్రామస్థులు నిలదీస్తున్నారు. పాలకవర్గం కిమ్మనకుండా ఉండటం వెనుక ఉన్న అంతర్యమేమిటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి కబ్జాను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గతంలో కాపాడిన భూమి మళ్లీ చేతులు మారుతోంది

గతంలోనూ ఇదే భూమి కొందరు వ్యక్తుల అక్రమ ఆధీనంలో ఉండేదని గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఎంతో రిస్క్ తీసుకుని, పద్ధతి ప్రకారం ప్రభుత్వ సర్వే చేయించి ఈ స్థలాన్ని కాపాడారని తెలిపారు. ఆ కష్టం మరువక ముందే.. ఇప్పుడు మరో వ్యక్తి వచ్చి ప్రభుత్వ భూమిని చెరబడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే విచారణ జరిపి, ప్రభుత్వ భూమికి సరిహద్దులు నిర్ణయించి, కబ్జాదారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హాజిపల్లి ప్రజలు కోరుతున్నారు.

Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >
Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >