Posted on 2026-03-11 18:39:30
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు?
డైలీ భారత్, కేశంపేట: కేశంపేట మండల పరిధిలోని పోల్కోనిగుట్ట తండా గ్రామపంచాయతీలో సర్వే నంబర్ 32 లో మట్టి రవాణా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. పట్టపగలే యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీ యంత్రాలతో తవ్వకాలు
గత కొన్ని రోజులుగా పోల్కోనిగుట్ట తండా పరిసరాల్లో రెండు పెద్ద ఇటాచి (Hitachi) యంత్రాలతో భూమిని తవ్వుతూ, పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వాహనాలు నిరంతరం మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం.
అధికారులు ఏం చేస్తున్నారు?
"మా కళ్ల ముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?" అని గ్రామస్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతోందా? లేక వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామస్తుల ఆవేదన:
"భారీ వాహనాల రాకపోకలతో రహదారులు ధ్వంసమవడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి."
తక్షణ చర్యలు అవసరం
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >