Posted on 2025-02-23 18:18:20
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో శంషాబాద్ జోన్ ఎస్వోటీ పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించి నలుగురిని అరెస్టు చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం రాత్రి పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు శంషాబాద్ బస్టాండ్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామానికి చెందిన బొడ్డు భాను ప్రసాద్, పెద్ద తుప్పర గ్రామానికి చెందిన బ్యాగరి సాయికిరణ్, మైనర్ బాలుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరు జిల్లాకు చెందిన రోహిత్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 156 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఐదు సెల్ ఫోన్లు, ఒక స్ప్లెండర్ బైక్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
12 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన మహా ఇల్లాలు
Posted On 2026-05-08 08:07:43
Readmore >
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >