| Daily భారత్
Logo




పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

News

Posted on 2026-05-07 19:59:26

Share: Share


పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

సమర్థవంతమైన దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ

డైలీ భారత్, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తమన్ రాజరాజేశ్వరి గురువారం నాడు మిడ్జిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కుర్రావత్ రమేష్ (25), మిడ్జిల్ మండలానికి చెందిన వ్యక్తిపై నేరం రుజువుకావడంతో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

2020 నవంబర్ 22వ తేదీన బాధిత బాలికపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. అప్పటి ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేయగా, అప్పటి జడ్చర్ల రూరల్ సీఐ శివకుమార్ దర్యాప్తు నిర్వహించి నిందితుడిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.జాన్ కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టి బలమైన వాదనలు వినిపించారు. మిడ్జిల్ ఎస్‌హెచ్‌ఓ పర్యవేక్షణలో సీడీఓలు రమేష్, PC 3229 మరియు శంకర్, PC 2194, అలాగే కోర్టు లైజనింగ్ ఏఎస్ఐ బాలకృష్ణ సాక్షులను క్రమపద్ధతిలో కోర్టులో ప్రవేశపెట్టి కేసు విచారణ సాఫీగా జరిగేలా కృషి చేయడంతో కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేందుకు సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, ప్రజా అభియోజకులను జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్  అభినందించారు.

#MahabubnagarPolice

Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >