Posted on 2026-05-07 18:18:48
కరీంనగర్కు కేటీఆర్ రాక !!
మే 9న కరీంనగర్ బంద్కు బీఆర్ఎస్ పిలుపు
కార్యాలయంపై దాడి ఘటనపై ఉధృతమవుతున్న రాజకీయ పోరు
డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు కరీంనగర్కు రానున్నారు. బాధిత నాయకులు, కార్యకర్తలను పరామర్శించడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.
ఈ నేపథ్యంలో మే 9న కరీంనగర్ బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యంపై దాడులకు నిరసనగా, రాజకీయ హింసను ఖండిస్తూ బంద్ నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాసంఘాలు సహకరించాలని కోరారు.
బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ, కార్యాలయాలపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తే సహించబోమన్నారు. “ఇది కేవలం బీఆర్ఎస్పై దాడి కాదు… ప్రజాస్వామ్య విలువలపై దాడి” అని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ పర్యటనతో కరీంనగర్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలిరానుండటంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అప్రమత్తమై భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >