| Daily భారత్
Logo




పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

News

Posted on 2026-05-07 22:08:07

Share: Share


పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

టెన్త్,ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పిల్లలను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచి మంచి మార్కులు సాధించిన జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పిల్లలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొత్తం 63 మంది పోలీస్ సిబ్బంది పిల్లలు,వారి తల్లీదండ్రులు హాజరయ్యారు.ముందుగా మంచి మార్కులు సాధించిన విద్యార్థిని,విద్యార్థులు కొంతమంది తమ తల్లీదండ్రుల కష్టాన్ని,భవిష్యత్తులో తాము సాధించాలనుకుంటున్న లక్ష్యాలను వివరిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకుగాను ఎస్పీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకు సేవలు అందిస్తూ తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించాలని పిల్లలకు సూచించారు. పట్టుదల,క్రమశిక్షణ,ఆత్మ స్థైర్యం  ఉంటే ఎలాంటి కష్టమైన లక్ష్యాన్నైనా సులభంగా సాధించవచ్చని అన్నారు.జీవితంలో ఎల్లప్పుడూ పాఠాలను నేర్చుకుంటూనే ఉండాలని, ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలని తెలిపారు.మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకొని,దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.పోలీస్ కుటుంబంలో పుట్టి పెరిగిన ఎస్పీ బాల్యం నుండి ఐపిఎస్ సాధించే వరకు తన గత స్మృతులను వారితో పంచుకున్నారు. అనంతరం మంచి మార్కులు సాధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు కుటుంబంలోని విద్యార్థినీ,విద్యార్థులకు ఎస్పీ ప్రశంసా పత్రాలతో పాటు మెమొంటోలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ సీఐ కరుణాకర్,త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి,ఎంటిఓ సుధాకర్, హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్ఐ నరసింహారావు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >