| Daily భారత్
Logo




యు ఎస్ ఫ్ ఐ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీని కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

News

Posted on 2025-02-22 19:06:08

Share: Share


యు ఎస్ ఫ్ ఐ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీని  కార్యక్రమం పోస్టర్  ఆవిష్కరణ

డైలీ భారత్, సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మార్చి 27న జరిగే చలో ఢిల్లీ జయప్రదం చేయాలని పోస్టర్ను విడుదల చేస్తూ,ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి  మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేస్తే కుట్ర జరుగుతుందని దీనిని తిప్పి కొట్టే దిశగా విద్యార్థుల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు  దేశవ్యాప్తంగా ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్య ను కేంద్రీకరణ దిశగా తీసుకువెళుతూ దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానంలో భాగంగా తీసుకొస్తున్న ప్రతిపాదనలు ప్రాథమిక సూత్రాలను ఉల్లంగించటమేనని దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో వైస్ ఛాన్స్లర్ నియామకాన్ని కేంద్రీకరించే  దిశగా  చేసే నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని ఇది రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన హక్కులను కాలరాయటమే  అని రాజ్యాంగ హక్కులను హరించే దిశగా యూనివర్సిటీలను కాషాయీకరణ వైపు తీసుకెళ్లడమేనని ఆగ్రహించారు 1956న పార్లమెంట్ యూజీసీని ఏర్పాటు చేసినప్పుడు విశ్వవిద్యాలయాలలో యూనివర్సిటీల ప్రమాణాలను నిర్ధారించడానికి అదేవిధంగా యూనివర్సిటీల సమన్వయానికి నిధులు, పరిశోధనా ప్రమాణాలు నిర్ధారించడానికి మెరుగుపరచడానికి ఏర్పాటుచేసిన  యూజీసీ కృషి చేయాలని చట్టం స్పష్టం చేస్తుంది కానీ నేడు వైస్ ఛాన్స్లర్ నియామకంలో అర్హతలు సవరిస్తూ కొత్త ప్రతిపాదన తెచ్చే అధికారం యూజీసీకి లేదని యుజిసి తెచ్చిన చట్టరీత్య చండుబాట అధికారం లేదని కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముసాయిదాను విద్యార్థి లోకం తిప్పికొట్టాలని ఇది ప్రైవేటు యూనివర్సిటీల ప్రోత్సాహకానికి బ్యూరోక్రాట్లు, పరిశ్రమలకు సంబంధించిన వారిని విసి లు గా   నియమించే విధంగా నిబంధనలను సడదింపు చేయటం దుర్మార్గమని ఇది యూనివర్సిటీ విద్యా ప్రమాణాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని ఉన్నత విద్యను కేంద్రం గుప్పెట్లో పెట్టుకొని కేంద్రీకృతం చేసి వ్యాపారమయం చేసే ఎత్తుగడలో తిప్పి కొట్టాలని రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించుకోవాలి వ్యవస్థ పట్ల దేశ అభివృద్ధి పట్ల విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పోరాటాలకు సన్నద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు, అనంతరం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ గా మార్చి 27 న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పోస్టర్లు విడుదల చేస్తారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్, గణేష్ రాష్ట్ర నాయకత్వం శేఖర్, జగన్, రాకేష్, ప్రశాంత్, శ్రీనివాస్, నరేష్ , అభి,తదితరులు  పాల్గొన్నారు

Image 1

శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్

Posted On 2026-05-07 22:23:39

Readmore >
Image 1

పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-05-07 22:08:07

Readmore >
Image 1

మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం

Posted On 2026-05-07 20:29:13

Readmore >
Image 1

జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం

Posted On 2026-05-07 20:07:14

Readmore >
Image 1

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

Posted On 2026-05-07 19:59:26

Readmore >
Image 1

"ఒత్తిడిని జయించేద్దామా" (మీ కోసమే మేమున్నాం..)

Posted On 2026-05-07 19:55:06

Readmore >
Image 1

మే 9న కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు

Posted On 2026-05-07 18:18:48

Readmore >
Image 1

టిఆర్ఎస్ మున్సిపల్ కోఆప్షన్ గా కుంభాల రవి యాదవ్

Posted On 2026-05-07 18:13:44

Readmore >
Image 1

నేడు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు....

Posted On 2026-05-07 13:26:51

Readmore >
Image 1

ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు

Posted On 2026-05-07 13:25:33

Readmore >