Posted on 2025-02-22 17:19:49
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొలకపోగు కాంతారావు మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు
డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంతారావు మాదిగ మాట్లాడుతూ రాష్ట్రం లో మాదిగలకు కనీసం రెండు మంత్రి పదవులు ఇవ్వాలని,క్యాబినెట్ విస్తరణలో భాగంగా మాదిగలకు న్యాయం చేయాలి,ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడిన మాదిగలను గుర్తించింది లేదు ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను గుర్తించి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు,ఈనెల 24వ తేదీన హైదరాబాదులో mrps అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది అట్టి కార్యక్రమానికి జిల్లా నాయకులు,మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హైదరాబాదుకు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలికపోగు కాంతారావు మాదిగ పిలుపునివ్వడం జరిగినది,
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొలికపోగు కాంతారావు, కోలికపోగు ముసలయ్య,ప్రసాదు,రావూరి వీరయ్య,రాయల పుల్లారావు,గద్దల వెంకటరమణ పాల్గొన్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >