Posted on 2025-02-21 11:44:24
డైలీ భారత్, వేములవాడ:శివరాత్రి వేడుకలకు వేములవాడ శ్రీ రాజరా జేశ్వరస్వామి దేవాలయం ముస్తాబవుతుంది, 25,26 27,మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయని, ఆలయ అధికారులు తెలిపారు..
ప్రభుత్వం తరపున మంత్రు లు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ తరపున పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు.
రెండువేల మంది పోలీసు లతో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సుమారు వెయ్యి బస్సులను ఏర్పాటు చేసింది. రాజన్న దర్శనానికి నాలుగున్నర లక్షల మంది వస్తారని అధికారుల అంచనా.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సొంత వాహనాలలో వచ్చేవారు తిప్పాపూర్ వద్ద వాహ నాలను పార్కింగ్ చేసుకోవాలని,తిప్పాపూర్ నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు సూచించారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >