Posted on 2024-09-01 13:31:45
శ్రీశైలానికి రాకపోకలు నిలిపివేత
డైలీ భారత్, శ్రీశైలం జిల్లా: భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో కొండచరియలు పడుతున్న నేపథ్యంలో మన్ననూరు చెక్పోస్ట్ నుంచి శ్రీశైలానికి వాహన రాకపోకలు నిలిపివేసినట్లు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.ప్రస్తుతానికి శ్రీశైలం-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు వాయిదా వేసుకోవాలని సూచించారు.యాత్రికులు ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. *భారీ వర్షం.. వాగులను తలపిస్తున్న రోడ్లు*
అల్ప పీడనం కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.కొన్ని చోట్ల పొలాలు నీట మునిగాయి.మరికొన్ని చోట్ల వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.మరోవైపు శ్రీశైలంలోని శ్రీగిరి కాలనీ,కొత్తపేట ఏరియాలో రోడ్లన్నీ జలమయమై వాగులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. సున్నిపెంటల ఓ రెండు గృహాలపై భారీ వేపచెట్టు కూలి గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తెల్లవారుజామున జరిగిన ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న వారికి ప్రాణాపాయం తప్పింది.
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >