Posted on 2024-09-01 10:01:45
శ్రీశైలానికి రాకపోకలు నిలిపివేత
డైలీ భారత్, శ్రీశైలం జిల్లా: భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో కొండచరియలు పడుతున్న నేపథ్యంలో మన్ననూరు చెక్పోస్ట్ నుంచి శ్రీశైలానికి వాహన రాకపోకలు నిలిపివేసినట్లు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.ప్రస్తుతానికి శ్రీశైలం-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు వాయిదా వేసుకోవాలని సూచించారు.యాత్రికులు ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. *భారీ వర్షం.. వాగులను తలపిస్తున్న రోడ్లు*
అల్ప పీడనం కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.కొన్ని చోట్ల పొలాలు నీట మునిగాయి.మరికొన్ని చోట్ల వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.మరోవైపు శ్రీశైలంలోని శ్రీగిరి కాలనీ,కొత్తపేట ఏరియాలో రోడ్లన్నీ జలమయమై వాగులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. సున్నిపెంటల ఓ రెండు గృహాలపై భారీ వేపచెట్టు కూలి గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తెల్లవారుజామున జరిగిన ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న వారికి ప్రాణాపాయం తప్పింది.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >