Posted on 2024-07-15 20:13:52
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్లోకి వలస కడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చేరిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాపాలనలో భాగంగా మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ చేరారు.
మహిపాల్రెడ్డి 2014 నుంచి వరుసగా మూడుసార్లు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అనుచరులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత కొద్దిరోజులుగా మహిపాల్ రెడ్డి చేరిక వాయిదా పడుతూ వస్తోంది. రెండు రోజుల క్రితం ఆయన చేరాల్సి ఉన్నా పార్టీ నేతల అభ్యంతరంతో వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మహిపాల్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్లో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, కాలేరు యాదయ్య, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, సంజయ్, కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. మరికొందరు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >