Posted on 2026-07-24 04:25:46
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు పిట్ల వంశీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గురువారం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడకుండా, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అలాగే యువత అంతా ఏకమై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
#RajannaSircilla #Sircilla #ThotaAgaiah #BRS #Vamshi #RacharlaGollapalli #Ellareddypet #Telangana #SircillaNews #TeluguNews #YouthAwareness #MentalHealthAwareness #Staya #BreakingNewsIndia
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >