Posted on 2026-09-06 16:20:56
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనుల కోసం నిజామాబాద్ కు చెందిన యువతి భక్తితో విరాళం అందజేసింది.
నిజామాబాద్ కు చెందిన భక్తురాలు జక్కుల రుచిత తనకు ఉద్యోగం రావడంతో, తన మొదటి జీతం నుంచి రూ. 26,730 నగదును స్వామివారి సేవ కోసం ఆలయ అధికారులకు అందజేశారు.
ఆలయ ప్రోటోకాల్ కార్యాలయంలో తల్లిదండ్రులు జె. రవీందర్, మీనా లతో కలిసి ఏఈవో లక్ష్మణరావు, పీఆర్వో పెరిక శ్రీనివాస్ లకు విరాళాన్ని అందించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.
మొదటి జీతాన్ని దేవుడికి సమర్పించిన రుచిత భక్తి భావం పలువురిని ఆకట్టుకుంటోంది.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >