| Daily భారత్
Logo




నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం

News

Posted on 2026-07-23 15:54:39

Share: Share


నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ.

డైలీ భారత్, కామారెడ్డి : వర్గీకరణ సాధన తోనే ఎమ్మార్పీఎస్ బాధ్యత తీరిపోలేదని,ఇక కుల మతాలకు అతీతంగా ఎమ్మార్పీఎస్ భవిష్యత్తు ఉద్యమం ఉంటుందని అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీ ల ను రద్దు చేసి నూతన తరం, యువతరం తోనే సంస్థాగత నిర్మాణాలప్రక్రియ ప్రారంభమైందని అది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుందని తెలియ జేస్తున్నాం

మాదిగ ఉద్యమం మానవతా ఉద్యమం...మందకృష్ణ మాదిగ పోరాటం లో అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిస్తున్నాం.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడం తోనే ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆగిపోలేదని, సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సమాజం లో అణగారి పోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, వికలాంగుల, అగ్రకులపేదల సంక్షేమం, ఆ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి భవిష్యత్తు ఉద్యమాలు నిర్ణయిస్తుందని తెలియ చేస్తున్నాం.

మాదిగ మరియు ఎస్సీ ఇతర కులాల న్యాయబద్ధమైన సమస్య వర్గీకరణ సాధన కోసం 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం దేశం లో సాధారణ విషయం కాదని ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, కుట్రలు, అణచివేతలు, వెన్ను పోట్లు,ఎదురుకుంటూనే విజయం సాధించిందని తెలియ చేస్తున్నాం.

జాతి నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ న్యాయబద్దం కాని సమస్యను ముట్టుకోడని, న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వదిలి పెట్టారని 32 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర లో వర్గీకరణ తో పాటు గా అనేక సామాజిక సమస్యల పరిష్కారం సమాజం గుర్తించిందని తెలియ చేస్తున్నాం.*

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరగబోయే సామాజిక ఉద్యమ కార్యాచరణ లో యువతరం కలిసి రావాలని పిలుపునిస్తున్నాం.

ఈరోజు కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగింది.

ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కాగా సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ,బట్ట వెంకట్రాములు మాదిగ, పెద్ద బూరి గంగారాం మాదిగ మావురం శ్రీకాంత్ మాదిగ, మహిళా నాయకురాలు సట్టిగారి లక్ష్మి మాదిగ,బానాపురం లావణ్య మాదిగ, సింగం కాశీరాం,మర్రిపల్లి అరుణ్ మాదిగ,కిష్టపురం పెద్ద కాశీరాం ఎనగుర్తి రాజనర్సయ్య, శైలేష్,జల్లి పల్లి శ్యాం,తిప్పారం రవి,శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్...

Posted On 2026-07-23 16:17:18

Readmore >
Image 1

ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం

Posted On 2026-07-23 16:06:22

Readmore >
Image 1

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 16:04:59

Readmore >
Image 1

వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-23 15:59:08

Readmore >
Image 1

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు

Posted On 2026-07-23 15:56:26

Readmore >
Image 1

నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం

Posted On 2026-07-23 15:54:39

Readmore >
Image 1

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ

Posted On 2026-07-23 14:52:41

Readmore >
Image 1

జూలై 24 విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 13:29:46

Readmore >
Image 1

తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-23 13:29:02

Readmore >
Image 1

చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృతి

Posted On 2026-07-23 12:58:50

Readmore >