| Daily భారత్
Logo




స్కాచ్ (SKOCH) అవార్డు అందుకున్న నెహ్రూ జూలాజికల్ పార్క్

News

Posted on 2026-06-20 20:26:39

Share: Share


స్కాచ్ (SKOCH) అవార్డు అందుకున్న నెహ్రూ జూలాజికల్ పార్క్

వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి జూపార్క్‌గా రికార్డు

తెలంగాణ అటవీ శాఖకు మంత్రి కొండా సురేఖ అభినందనలు

డైలీ భారత్, న్యూఢిల్లీ/ హైదరాబాద్: అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న కృషికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. మౌస్ డీర్ (Mouse Deer) సంరక్షణ, బ్రీడింగ్ మరియు అడవుల్లోకి పునరావాసం (Conservation Breeding & Reintroduction) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రతిష్టాత్మక స్కాచ్ (SKOCH) అవార్డును అందుకుంది. వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో ఈ అవార్డును అందుకున్న దేశంలోని తొలి జూపార్క్‌గా నెహ్రూ జూలాజికల్ పార్క్ నిలిచింది.

కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమలో భాగంగా అందించే ఈ అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీ లో జరిగింది.. నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ వసంత ఈ అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అటవీ దళాల అధిపతి (PCCF & HoFF) డా. సీ. సువర్ణ, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం వల్లే ఈ ప్రతిష్టాత్మక అవార్డు సాధ్యమైందన్నారు. అలాగే మౌస్ డీర్ సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జూ సిబ్బంది, సాంకేతిక బృందం, సహచర ఉద్యోగుల కృషిని ఆమె అభినందించారు.

ఈ అవార్డు లభించడం పట్ల జూ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియలో సహకరించి, తమకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ జూ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ (PCCF) వినయ్ కుమార్ మాట్లాడుతూ, వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి వినూత్న సంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని తెలిపారు.

ఈ అవార్డు సాధించిన నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు, సిబ్బందితో పాటు తెలంగాణ అటవీ శాఖను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు సాధించాలని ఆకాంక్షించారు.

Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >
Image 1

పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-06-21 17:39:26

Readmore >
Image 1

బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:38:05

Readmore >
Image 1

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Posted On 2026-06-21 13:42:34

Readmore >