Posted on 2026-06-20 16:02:50
డైలీ భారత్, దమ్మన్నపేట: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఇన్చార్జి ,ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానిదేనని తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు వివిధ యోగాసనాలను ప్రదర్శించగా, ఉపాధ్యాయులు కూడా వారితో కలిసి యోగాసనాలు చేశారు. యోగా యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుడికాడి కొమురయ్య, జడల విజయశ్రీ, తాడూరి సంపత్ కుమార్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >