Posted on 2026-06-20 19:32:50
డైలీ భారత్, దమ్మన్నపేట: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఇన్చార్జి ,ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానిదేనని తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు వివిధ యోగాసనాలను ప్రదర్శించగా, ఉపాధ్యాయులు కూడా వారితో కలిసి యోగాసనాలు చేశారు. యోగా యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుడికాడి కొమురయ్య, జడల విజయశ్రీ, తాడూరి సంపత్ కుమార్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు
Posted On 2026-06-20 20:28:48
Readmore >
జడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-20 19:32:50
Readmore >
ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక
Posted On 2026-06-20 19:30:39
Readmore >
40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ
Posted On 2026-06-20 19:13:51
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అమలులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 8వ స్థానం
Posted On 2026-06-20 19:13:02
Readmore >
నీట్ ఎగ్జామ్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
Posted On 2026-06-20 19:09:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించి రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం
Posted On 2026-06-20 19:05:45
Readmore >