| Daily భారత్
Logo




డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు

News

Posted on 2026-06-20 20:28:48

Share: Share


డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు

₹4,06,400 జరిమానా, 20 మందికి జైలు శిక్షలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 374 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి వివిధ శిక్షలు విధించింది.

ఈ కేసుల్లో మొత్తం ₹4,06,400 జరిమానా విధించబడింది. అదేవిధంగా 15 మందికి ఒక రోజు జైలు శిక్ష, 3 మందికి రెండు రోజుల జైలు శిక్ష, ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష, మరొకరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించబడింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, “మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాము. మద్యం సేవించిన అనంతరం వాహనాలు నడపకుండా ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను వినియోగించాలి. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత” అని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరించారు.

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-06-20 20:28:48

Readmore >
Image 1

స్కాచ్ (SKOCH) అవార్డు అందుకున్న నెహ్రూ జూలాజికల్ పార్క్

Posted On 2026-06-20 20:26:39

Readmore >
Image 1

జడ్‌పీహెచ్‌ఎస్ దమ్మన్నపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-20 19:32:50

Readmore >
Image 1

ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక

Posted On 2026-06-20 19:30:39

Readmore >
Image 1

40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ

Posted On 2026-06-20 19:13:51

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అమలులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 8వ స్థానం

Posted On 2026-06-20 19:13:02

Readmore >
Image 1

స్ప్రింగ్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు

Posted On 2026-06-20 19:10:02

Readmore >
Image 1

నీట్ ఎగ్జామ్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

Posted On 2026-06-20 19:09:02

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించి రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం

Posted On 2026-06-20 19:05:45

Readmore >
Image 1

బడిపంతులుగా మారిన ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-06-20 12:14:40

Readmore >