| Daily భారత్
Logo




ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక

News

Posted on 2026-06-20 16:00:39

Share: Share


ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక

డైలీ భారత్,దమ్మన్నపేట: జడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేట పాఠశాల  విద్యార్థి చిప్పల విశాల్ ఎన్ఐటీ వరంగల్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక మెంటరింగ్ కార్యక్రమానికి ఎంపికయ్యాడు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు తెలిపారు 

2025 జనవరి నెలలో జడ్చర్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ మాన్‌క్ (INSPIRE MANAK) పోటీలలో విశాల్ ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. గైడ్ టీచర్ మరియు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్ మార్గదర్శకత్వంలో రూపొందించిన “జంతు మృత కళేబరాల తొలగింపు ట్రాలీ” ఆవిష్కరణ జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం.

ఈ నేపథ్యంలో జూన్ 22న ఎన్ఐటీ వరంగల్‌లో నిర్వహించనున్న మెంటరింగ్ కార్యక్రమంలో విశాల్ తన గైడ్ టీచర్ తాడూరి సంపత్ కుమార్‌తో కలిసి పాల్గొననున్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్ఐటీ ప్రొఫెసర్లు, విద్యా మరియు సాంకేతిక నిపుణులు ఆవిష్కరణను మరింత మెరుగుపరచడం, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం అవసరమైన సూచనలు, సలహాలు అందించనున్నారు.

విద్యార్థి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, జిల్లా సైన్స్ అధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ విశాల్‌కు, గైడ్ టీచర్ తాడూరి సంపత్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >