Posted on 2026-06-20 19:30:39
డైలీ భారత్,దమ్మన్నపేట: జడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేట పాఠశాల విద్యార్థి చిప్పల విశాల్ ఎన్ఐటీ వరంగల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక మెంటరింగ్ కార్యక్రమానికి ఎంపికయ్యాడు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు తెలిపారు
2025 జనవరి నెలలో జడ్చర్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మాన్క్ (INSPIRE MANAK) పోటీలలో విశాల్ ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. గైడ్ టీచర్ మరియు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్ మార్గదర్శకత్వంలో రూపొందించిన “జంతు మృత కళేబరాల తొలగింపు ట్రాలీ” ఆవిష్కరణ జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం.
ఈ నేపథ్యంలో జూన్ 22న ఎన్ఐటీ వరంగల్లో నిర్వహించనున్న మెంటరింగ్ కార్యక్రమంలో విశాల్ తన గైడ్ టీచర్ తాడూరి సంపత్ కుమార్తో కలిసి పాల్గొననున్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్ఐటీ ప్రొఫెసర్లు, విద్యా మరియు సాంకేతిక నిపుణులు ఆవిష్కరణను మరింత మెరుగుపరచడం, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం అవసరమైన సూచనలు, సలహాలు అందించనున్నారు.
విద్యార్థి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, జిల్లా సైన్స్ అధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ విశాల్కు, గైడ్ టీచర్ తాడూరి సంపత్ కుమార్కు అభినందనలు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు
Posted On 2026-06-20 20:28:48
Readmore >
జడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-20 19:32:50
Readmore >
ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక
Posted On 2026-06-20 19:30:39
Readmore >
40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ
Posted On 2026-06-20 19:13:51
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అమలులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 8వ స్థానం
Posted On 2026-06-20 19:13:02
Readmore >
నీట్ ఎగ్జామ్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
Posted On 2026-06-20 19:09:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించి రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం
Posted On 2026-06-20 19:05:45
Readmore >