Posted on 2026-06-21 10:12:34
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జూలూరుపాడు లో ఆరోగ్య జీవన యాత్ర సభ్యుల సమక్షంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో నిత్యం యోగా చేస్తున్న ఆరోగ్య జీవన యాత్ర యోగ సభ్యులు యోగ డే రోజున యోగాసనాలతో పాటు ధ్యానం చేశారు అనంతరం జూలూరుపాడు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి యోగ ప్రాముఖ్యతను తెలిపే నినాదాలు ఇచ్చారు అనంతరం వెంగన్నపాలెంలోని స్మశాన వాటిక యందు రావి మరియు మర్రిచెట్టులను నాటి సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు ఈ సందర్భంగా యోగ ట్రైనర్ బోసు ను సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక శ్రమ లేకపోవడంఆహారపు అలవాట్లలో మార్పు వచ్చిందని అందువల్లనే చిన్నవయసులో బిపి షుగర్ గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు పిసిఒడి థైరాయిడ్ కంటి చూపు మందగించడం లాంటిది జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాకింగ్ యోగా ధ్యానం లాంటివి చేయాల్సిన పరిస్థితి ఉందని వీటితో పాటు ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని అదేవిధంగా జంక్ ఆహారంజోలికి వెళ్ళవద్దని మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ శారీరక వ్యాయామం చేయాలని అన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >