| Daily భారత్
Logo




ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

News

Posted on 2025-11-22 16:16:40

Share: Share


ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

ఐదుగురు అరెస్ట్ – 6.30 లక్షల నగదు  సీజ్

ఐదు లాప్టాప్ లు, 32 చరవాణీలు

22 బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్కులు, 11 చెక్కులు, 30 ఏటీఎం కార్డులు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం

డైలీ భారత్ న్యూస్, మంగళగిరి:మంగళగిరి రూరల్‌ పరిధిలో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు భేదించారు. శనివారం మంగళగిరి గ్రామీణ సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు...ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చిన్న కాకాని ప్రాంతంలోని ఎన్‌ఆర్‌ఐ హాస్పటల్‌ వెనుక ఎస్వీఎన్‌ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్‌లోని ఒక ప్లాట్‌లో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతోందని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడి నుంచి కొక్కిలిగడ్డ ఏసన్నను అదుపులోకి తీసుకోగా, బాలు, ప్రవీణ్‌, సూర్య పారిపోవడంతో వారిని శుక్రవారం నాడు ఎన్‌ఆర్‌ఐ జంక్షన్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు.ఈ కేసులో ఇందుకూరి బాలకృష్ణ రాజు, కొక్కిలిగడ్డ ఏసన్న, మనోహర్‌, ప్రవీణ్‌, సూర్య ప్రకాశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ₹6,30,000 నగదు, ఐదు ల్యాప్‌టాప్‌లు, 32 మొబైల్‌ ఫోన్లు, 22 బ్యాంక్ పాస్‌బుక్స్, 11 చెక్‌బుక్స్, 30 ఏటీఎం కార్డులుతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు...ప్రధాన నిందితుడు మనోహర్ ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు కావడంతో టెలిగ్రామ్ ద్వారా అందిన లింక్‌ను నమ్మి www.hublibook.com సైట్ ద్వారా అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు విచారణలో తెలిసిందని ఆయన వెల్లడించారు. ఇందుకోసం తెలియని వ్యక్తుల ఆధార్ కార్డులపై సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను తెరిపించి మొత్తం 30 అకౌంట్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు.ఈ గుంపు క్రికెట్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్ పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి కస్టమర్లను మోసగించేదని చెప్పారు. డిపాజిట్లు, విత్‌డ్రాలు, అకౌంట్ బ్యాలెన్స్ వంటి కార్యకలాపాలను నిందితులు కలిసి నిర్వహించినట్లు వివరించారు.

ఆన్లైన్ బెట్టింగ్‌లలో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ఇటువంటి మోసపూరిత వ్యవహారాలను నిర్మూలించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గ్రామీణ సీఐ ఏవి బ్రహ్మం, గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్, కేసు చేయించడంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది కే అంకమ్మరావు, జి శ్రీనివాసరావు లు ఉన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >