Posted on 2025-11-22 15:28:37
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లామోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను తొలగించి, జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారుపోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మోడిఫైడ్ సైలెన్సర్లతో నడిపే బుల్లెట్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.కొందరు యువకులు వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పుచేసి వింత శబ్దం, అగ్ని మంట వచ్చే వాటిని అమర్చి, రోడ్లపై అకస్మాత్తుగా వింత శబ్దాలు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతున్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. *అందులో భాగంగా ఈరోజు 20 మోడిఫైడ్ సైలెన్సర్ల వరకూ తొలగించి ఒక్కో వాహనదారుడికి రూ.1,000 జరిమానా విధించారమని తెలిపారు. ఇప్పటికే సుమారు1000 మోడిఫైడ్ సైలెన్సర్ల వరకు తొలగించడం జరిగిందని తెలిపారుకార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ఐ అప్పలనాయుడు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >