Posted on 2026-07-15 06:37:33
బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా పనిచేయాలి.
స్టేషన్లో పెండింగ్ కేసులను నాణ్యమైన దర్యాప్తుతో సత్వరమే పూర్తి చేయాలి.
ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలి.
డయల్-100 కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించాలి.
పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను అమలు చేసి, రోడ్డు ప్రమాదాలను నివారించాలి.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మంగళవారం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ, సిబ్బంది రోల్కాల్ను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ అధికారులు, సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతి మరియు ప్రజలకు అందుతున్న సేవలపై సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించే ప్రతి బాధితుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించి, ప్రజలకు పోలీస్ శాఖపై మరింత విశ్వాసం కలిగేలా ప్రతి అధికారి బాధ్యతగా మరియు జవాబుదారీతనంతో సేవలు అందించాలని స్పష్టం చేశారు. స్టేషన్లో నమోదైన ప్రతి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, నాణ్యమైన దర్యాప్తు ప్రమాణాలను పాటిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ ప్రాపర్టీ భద్రతపై ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులను చట్టపరమైన నిబంధనల ప్రకారం భద్రపరచాలని, వాటి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. అలాగే, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రి సమయాల్లో పటిష్టమైన వాహన తనిఖీలు మరియు గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ చెప్పారు. ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, లాటరీ మోసాలు, ఫేక్ లింకులు మరియు ఓటీపీ మోసాల పట్ల గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా, అత్యవసర సమయాల్లో డయల్-100 ద్వారా వచ్చే పిలుపులకు అత్యంత వేగంగా స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు తక్షణ సహాయం అందించి భరోసా కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇదే క్రమంలో కామారెడ్డి పట్టణ ట్రాఫిక్ నిర్వహణపై ఎస్పీ ప్రత్యేక సమీక్ష జరిపారు. ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ను ఉద్దేశించి మాట్లాడుతూ, పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా సమర్థవంతమైన ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్ఐలు , ట్రాఫిక్ ఎస్ఐ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >