Posted on 2026-07-14 11:38:49
డైలీ భారత్, వినుకొండ:కుటుంబ కలహాలు పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను బలిగొనడంతో పాటు ఒక తల్లి బలవన్మరణానికి కారణమైంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన నక్కా భారతి (24) కి, పాల వ్యాన్ డ్రైవర్గా పనిచేసే సునీల్ రెడ్డితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తేజేష్ రెడ్డి (6), హేమనాథ నాగిరెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా భర్త వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో దంపతుల మధ్య తరచూ తీవ్రమైన గొడవలు జరుగుతుండేవి.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి.. సోమవారం రాత్రి భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు బిడ్డలకు ఆహారంలో విషం ఇచ్చి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించేసరికి ముగ్గురూ నిర్జీవంగా పడి ఉన్నారు.
ఘటనా స్థలంలో భారతి రాసిన ఒక చిన్న ఆత్మహత్య లేఖ లభ్యమైంది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆమె అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వినుకొండ రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >